సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పోలీస్ కో ఆపరేటివ్ సొసైటీని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నడపాలని, పోలీసు పిల్లలు సివిల్ సర్వీస్, గ్రూప్లలో మంచి ఉద్యోగాలు సాధించే విధంగా నిరంతరం ప్రోత్సహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సిబ్బందికి సూచించారు. అలాగే, స్పోర్ట్స్తో పాటు మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దాలన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసు కో ఆపరేటివ్ సొసైటీ మొదటి సర్వసభ్య సమావేశం గురువారం కమిషనరేట్ కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి సీపీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడిగా సీపీ సొసైటీ సర్టిఫికెట్ను ఆవిష్కరించగా, సొసైటీ ఉపాధ్యక్షులుగా అదనపు డీసీపీ నర్మ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఏసీపీ జావెద్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకటయ్య, కృష్ణారెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్ హెడ్ క్వార్టర్స్లో ఎం.టీ విభాగంలో రూ. 8 లక్షలతో మరమ్మతులు చేసిన మెకానికల్ షెడ్ను సీపీ మహేశ్ భగవత్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఐదు నెలల పాటు సాగిన బ్రాస్ బాండ్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, రాచకొండ బ్యాండ్ సభ్యులకు బహుమతి అందజేశారు.