మారేడ్పల్లి, జనవరి 18: కరోనా సమయంలో బేగంపేట (టీటీఐ) ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ పోలీసు సిబ్బంది, అధికారులు చేసిన సేవలకు గుర్తింపుగా బుధవారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం మారేడ్పల్లి వారు బుధవారం బ్రహ్మకుమారి విశ్వ విద్యాలయ సిస్టర్స్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎం.వి రమేష్, ఏసీపీ శంకర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిస్టర్ మంజు ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, జస్టిస్ ఎం.వి రమేష్లతో పాటు ట్రాఫిక్ పోలీసు ఎస్ఐలు, సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ సునీత ,బిందు, రంజన్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.