హైదరాబాద్: నగరంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నగర శివార్లలోని బాచుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు.. ఐడీపీఎల్ హౌసింగ్ కాలనీ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మద్యాన్ని తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. డీసీఎమ్, మందు బాటిళ్లను సీజ్ చేశారు. సీజ్చేసిన మద్యం విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.