అంబర్పేట్ కార్ హెడ్క్వార్టర్స్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరుడైన హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మకు పాదాభివందనం చేస్తున్న సీపీ మహేశ్ భగవత్
బంజారాహిల్స్. అక్టోబర్ 21: దేశరక్షణలో సీఆర్పీఎఫ్ త్యాగాలు మరువలేనిదని సీఆర్పీఎఫ్ దక్షిణ్ సెక్టార్ ఐజీపీ మహేశ్ చంద్ర లడ్డా అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్లోని సీఆర్పీఎఫ్ దక్షిణ్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో అమర వీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సరిహద్దుల రక్షణతో పాటు తీవ్రవాద వ్యతిరేక పోరులో సైతం సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎన్నో పోరాటాలు చేశారని మహేశ్లడ్డా అన్నారు. సీఆర్పీఎఫ్ డీఐజీ ఖాజా సజ్జానుద్దీన్, కమాండెంట్లు విశ్వనాథ్, రాజ్ ముకుత్ తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సిటీ ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్(కార్) హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో గోషామహల్ స్టేడియంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు కార్ సిబ్బంది రక్తదానం చేశారు. అంతకుముందు ఈ శిబిరాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీలు శిఖా గోయెల్, చౌహాన్ సందర్శించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మైదానంలో ఫ్లాగ్డే నిర్వహించారు. అమరుల స్థూపానికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులు నివాళులర్పించారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను సత్కరించారు.