బడంగ్పేట, జనవరి 16: మీర్పేట పోలీస్స్టేషన్లో ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఫిర్యాదు దారులు ఎవరు గుంపులుగా రావద్దని, పీఎస్ బయటే కౌంటర్లు పెట్టామని సీఐ మహేందర్రెడ్డి తెలిపారు.
కాచిగూడ పోలీస్స్టేషన్లో..
కాచిగూడ, జనవరి 16: కాచిగూడ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి అంబర్పేట పోలీస్ దవాఖానలో కొవిడ్ టెస్టులు నిర్వహించారు. 10 మందికి పరీక్షలు చేయగా, ఎస్సైతో సహా 6 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో..
బండ్లగూడ,జనవరి 16: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కరోనా దడ పుట్టిస్తున్నది. వారం రోజుల్లో సుమారు 15 మంది వైరస్బారినపడ్డారు. పోలీస్స్టేషన్కు వచ్చేవారు తప్పని సరిగా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఇన్స్పెక్టర్ కనకయ్య సూచించారు.
జీడిమెట్ల పోలీస్స్టేషన్లో..
జీడిమెట్ల, జనవరి 16 : జీడిమెట్ల పీఎస్లో కరోనా కలకలం రేపింది. ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాస్కు లేకుండా ఎవరిని ఠాణాలోకి అనుమతించడం లేదు.
ఆరుగురు వైద్యులకు..
వనస్థలిపురం, జనవరి 16 : వనస్థలిపురం ఏరియా దవాఖానలో సేవలందిస్తున్న ఆరుగురు వైద్యులు, ఓ సెక్యూరిటీ గార్డుకు పాజిటివ్ వచ్చింది. దీంతో వారు హోం ఐసొలేషన్కు వెళ్లినట్లు తెలిసింది.
‘గాంధీ’కి రోగుల తాకిడి
గాంధీ దవాఖానలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నది.ప్రస్తుతం 125 మంది కరోనా బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. వారిలో 35 మంది గర్భిణులు, నలుగురు చిన్నారులున్నారు.