పట్టుబడిన బెట్టింగ్ ముఠా.. ఐదుగురు అరెస్టు
రూ. 1.20 కోట్లు స్వాధీనం
సిటీబ్యూరో, ఏప్రిల్ 9: క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీనివాస్, ఉదయ్కుమార్తో కలిసి భీమవరం వాసి అప్పలరాజు నుంచి యాప్ లైన్ తీసుకొని.. బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ ప్రారంభంమైనప్పటి నుంచి చక్రవర్తి భారీగా బెట్టింగ్లకు పాల్పడుతున్నాడు. రాచకొండ ఎస్వోటీ పోలీసులు చక్రవర్తి ఇంట్లో రూ. 12.50 లక్షల నగదుతో పాటు ప్రధాన బుకీ అప్పల రాజుకు చెందిన 8 ఖాతాల్లో రూ. 96.78 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు. కారుతో పాటు మొత్తం రూ. 1.20 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. చక్రవర్తితో పాటు వేములపర్తి హరీశ్, చెన్నిరెడ్డి సురేశ్రెడ్డి, సామ జైపాల్రెడ్డి, షేక్ ఆసీఫ్ పాషాలను అరెస్టు చేశారు. అప్పలరాజు, శ్రీనివాస్ ఉదయ్కుమార్ పరారీలో ఉన్నారు.
బుకీ అరెస్ట్
బేగంపేట్ ఏప్రిల్ 9: ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని శనివారం మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకమ్మకుంట ఎంఐజీలో నివాసముండే పవన్జైన్ అలియాస్ పవన్ (37) శనివారం సికింద్రాబాద్ పార్క్లేన్ సెంటర్లోని డీ బార్ అండ్ రెస్టారెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు.