సినీ నటుడికి నటి బెదిరింపులు
రూ.5 లక్షలు డిమాండ్..కేసు నమోదు
వెంగళరావునగర్, జూలై 13 : తన స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోను వైరల్ చేస్తానని, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ సినీ నటుడిని బెదిరిస్తున్న నటిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని నవోదయకాలనీలో ఉండే నటుడు యువరాజ్ కుమార్ రెజెటి (28) సెల్ఫోన్కు ఓ నటి (25) వీడియోను పంపింది.
రెండేండ్ల కిందట తన ప్రియురాలితో ఓ ప్రైవేటు ఫంక్షన్లో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఆ వీడియోను పంపిన ఆ నటి.. తనకు డబ్బులు ఇవ్వకపోతే.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించింది. బుధవారం అమీర్పేట సత్యం థియేటర్ వద్దకు డబ్బులు తెచ్చి ఇవ్వాలని, లేని పక్షంలో ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్కు వెళ్లి డైరెక్టర్లకు,నిర్మాతలకు ఆ వీడియోను అందజేసి.. కెరీర్ను పాడు చేస్తానని హెచ్చరించింది. దీంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.