Uppal Bhagayath | హైదరాబాద్ : ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మరోసారి ప్లాట్లు అమ్మకానికి నోటిఫికేషన్ జారీ అయింది. 63 ప్లాట్లు విక్రయించనున్నట్లు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
464 నుంచి 11,374 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లను విక్రయించనున్నారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్లాట్లకు జూన్ 30న ఈ-వేలం నిర్వహించనున్నారు. కనీస ధర చదరపు గజానికి రూ. 35 వేలుగా నిర్ణయించారు. జూన్ 13న ప్రీ బిడ్ సమావేశం, రిజిస్ట్రేషన్కు 27 వరకు గడువు విధించారు.