హైదరాబాద్: మహిళా అసిస్టెంట్ (Assistant Pilot) పైలట్పై ఓ పైలట్ (Pilot) లైంగిక దాడికి యత్నించాడు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో యువతి (26)తోపాటు రోహిత్ శరణ్(60) కమర్షియల్ పైలట్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న సంస్థకు చెందిన పని నిమిత్తం బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట (Begumpet) నుంచి పుట్టపర్తి మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్లింది. ఆమెతోపాటు నిందితుడు కూడా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో అసిస్టెంట్ పైలట్తోపాటు మరో ఇద్దరు పైలట్లు బస చేశారు.
ఈ సందర్భంగా హోటల్ గదిలో ఆమెపై రోహిత్ శరణ్ అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమె అక్కడి నుంచి పారిపోయి హైదరబాద్ చేరుకున్నది. అనంతరం సదరు పైలట్ తనపై లైంగికదాడికి యత్నించాడని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రోహిత్ శరణ్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటన బెంగళూరు హలసూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.