రవీంద్రభారతి: ఎలాంటి తప్పు చేయని తనను పికెట్ డిపోలోనే విధులు నిర్వహించేలా ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలివ్వాలని పికెట్ డిపో కండక్టర్ అంజయ్య విజ్ఞప్తి చేశారు. బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తాను కోరుట్ల డిపోలో కండక్టర్గా పనిచేశానని తెలిపారు. తన భార్య ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ పికెట్ డిపోకు ఈ ఏడాది జనవరిలో డిప్యూటేషన్ ద్వారా వచ్చానన్నారు.
జనవరి 18న మేడారం జాతరలో ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను ఓ న్యూస్ చానల్కు చెప్పానని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత పికెట్ డిపో మేనేజర్ ఎల్. రవీందర్ తనపై కక్షకట్టి, మందలించి ఫిబ్రవరి 24 నుంచి తనకు డ్యూటీలు వేయడంలేదన్నారు. మార్చి 10న కరీంనగర్ రీజయన్కు తిరిగి వెళ్లిపోవాలని లెటర్ ఇచ్చారన్నారు. కరీంనగర్ రీజియన్లో ఏ డిపోలో డ్యూటీ చేయాలో రీజినల్ మేనేజర్ బి.రాజు కూడా చెప్పలేదన్నారు. డ్యూటీలేక ,జీతాలు రాక ఇబ్బందులుపడుతున్నాన్నా.