ఉస్మానియా యూనివర్సిటీ, మే 18 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్స్ (పీజీడీసీఏ) పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీడీసీఏ మొదటి సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని ఆయన తెలిపారు.