మైలార్దేవ్పల్లి/బండ్లగూడ/అత్తాపూర్/మలక్పేట/ చాదర్ఘాట్, జనవరి 01: మలక్పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటలకు 2023కి గుడ్బై చెప్పి 2024కు స్వాగతం పలికారు. సోమవారం రాజేంద్రనగర్, బుద్వేల్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, నార్సింగి, మణికొండ, శంషాబాద్, బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్, శంషాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుంచే మద్యం కోనుగోళ్లు చేపట్టారు. వైన్ షాపుల ముందు భారీ ఎత్తున క్యూ కట్టి మద్యాన్ని కోనుగోలు చేశారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని రిసార్ట్లు, వ్యవసాయ క్షేత్రాలు, రెస్టారెంట్లలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహకులు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి రోడ్లపైకి వచ్చిన వారిని ఆపి వారిపై కేసులు నమోదు చేశారు.
మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలోని వెంకన్నగుట్ట వేంకంటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకోని లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు.
నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సోమవారం ప్రజలంతా దేవాలయాలకు వెళ్లి పూ జలు నిర్వహించారు. పలు దేవాలయాల వద్ద భక్తులు ఉదయం నుంచే దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, పిరం చెరువు, బుద్వేల్, కిస్మత్పూర్, హైదర్షాకోట్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల వద్ద భక్త సందోహం కనిపించింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆరె మైసమ్మ ఆలయం కిక్కిరిసింది. అమ్మవారిని దర్శించుకుని నూతన సంవత్స రంలో శుభాలు జరగాలని కోరుకున్నారు.
కైస్తవులంతా బైబిల్ విశ్వాసాలను పాటిస్తూ పేదలకు సాయం చేయాలని క్రిష్టియన్ లైఫ్ సెంటర్ చర్చి పాస్టర్లు ఇమ్మాన్యూయేల్, ప్రభుచరణ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా లక్ష్మీనగర్లోని క్రిష్టియన్ లైఫ్ సెంటర్ చర్చిలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు స్వీట్లు, క్యాలెండర్లను పంపిణీ చేశారు. క్రిస్టియన్ మత పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డికి సోమవారం అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కొలన్ సుభాశ్రెడ్డి, జే.చిత్తారి ఆధ్వర్యంలో సబితాఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సోమవారం సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ రోహిత్రాజ్ స్థానిక నల్గొండ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సౌత్ఈస్ట్ జోన్ పోలీస్ అధికారులు, ఏసీపీ శ్యాంసుందర్, చాదర్ఘాట్ సీఐ వై.ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.