హైదరాబాద్ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.
అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు జీహెచ్ఎంసీ అధికారుల సహాయం కొరకు 21111111 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలన్నారు. కార్పొరేటర్లు డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులపై సమీక్షించాలన్నారు. ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మంత్రి సూచించారు.