నేరేడ్మెట్, మే 18 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం గౌతంనగర్లో సన్ఫ్లవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక కార్పొరేటర్ సునితారాము యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శామ్యల్, మల్కాజిగిరి సర్కిల ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు తప్పనిసరి..
అల్వాల్, మే 18 : ప్రజా భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. అల్వాల్లో ఆనందరావు నగర్లో ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో కలిసికట్టుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హరిబాబు, వాసు, రంజిత్కుమార్, లారెన్స్, శర్మ, నరహరి, సుందరరాజు, నాయకులు కొండల్రెడ్డి, ఆనంద్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన కార్పొరేటర్..
నేరేడ్మెట్, మే 18 : నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బుధవారం తన నివాసంలో గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డికి ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.