చిక్కడపల్లి, నవంబర్ 26 : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. బాగ్లింగంపల్లి లోని సుందరయ్య పార్కు వద్ద, వీఎస్టీ ఫంక్షన్ హాల్ పక్కలైన్లో, అచ్చయ్యనగర్ బస్తీ ప్రధాన రోడ్డు ప్రాంతాల్లో సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. వీటిని పట్టించుకోకపోవడంతో చెత్త పేరుకు పోయింది. టాయిలెట్లను ఉపయోగించే పరిస్థితి లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని టాయిలెట్లను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
ప్రజలు ఉపయోగించు కోవడం లేదు
పబ్లిక్ టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకోవడం లేదు. టాయిలెట్ల క్లీనింగ్ను ఏజెన్సీకి అప్పగించాం. వారు ప్రతి రోజూ క్లీనింగ్ చేస్తున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఏఎంఓహెచ్ మైత్రేయి