ఉత్సాహంగా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి
గ్రేటర్లో నాలుగు రోజుల్లో 27, 044 టన్నుల
వ్యర్థాల తొలగింపు దావూద్గూడ తండా
పల్లె నిద్రలో పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి
కీసరలో మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ ఉదయ్నగర్లో
మేయర్ విజయలక్ష్మి పర్యటన
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ ‘స్వచ్ఛ’మేవ జయతే అంటూ నినదిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా సాగుతున్నది. ‘స్వచ్ఛ’ సంకల్పంతో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతుండగా, నాలుగు రోజుల్లో మొత్తం 27,044 టన్నుల వ్యర్థాలను తొలగించారు. దీంతో పాటు మొకలు నాటడం, నాలాలు, డ్రైనేజీల్లో పూడికతీత, దోమల నివారణ, నీటి ట్యాంకుల శుభ్రత, గుంతల పూడ్చివేత వంటివి చేపట్టారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకొని.. పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. సోమవారం కీసరలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ సరిల్ రోడ్ నంబర్. 11లోని ఉదయ్నగర్లో మేయర్ విజయలక్ష్మి పర్యటించి.. పనులు పర్యవేక్షించారు. దావూద్గూడతండాలో మంత్రి సబితారెడ్డి పల్లెనిద్రలోపాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం
గ్రేటర్ హైదరాబాద్లో నాలుగు రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 30 సర్కిళ్లు.. 150 వార్డుల్లోని 583 కాలనీల్లో పట్టణ ప్రగతితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇప్పటి వరకు 19, 542 కాలనీల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టారు. పారిశుధ్య నిర్వహణ, మొకలు నాటే స్థలాల గుర్తింపు, పట్టణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు, పూడిక తీత, గుంతలు పూడ్చడం లాంటి పనులు చేపట్టారు.
పట్టణ ప్రగతిలో భాగంగా గోషామహల్ నియోజకవర్గం పూల్బాగ్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
మూడుచింతలపల్లి గ్రామంలో సీఎం ప్రత్యేక నిధులతో నిర్మించిన మినీ స్టేడియంను ప్రారంభిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు
పట్టణ ప్రగతిలో నాలుగు రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలు
గ్రీనరీ
పట్టణ ప్రగతిలో భాగస్వామ్యం అవుదాం..
స్వచ్ఛ కాలనీలుగా మార్చుకుందాం
పౌరులకు మేయర్ పిలుపు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాలనీ వాసులను కోరారు. జూబ్లీహిల్స్ సరిల్ రోడ్ నంబర్ 11లోని ఉదయ్ నగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కాలనీల్లో ఎకడ పడితే అకడ వ్యర్థాలు పడవేయవద్దన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటించి సమస్యల పరిషారానికి కృషి చేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు. డ్రైన్, వాటర్ లీకేజ్, సీవరేజ్ సమస్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వాటర్ బోర్డు డీజీఎం శ్రీనివాస్ను మేయర్ ఆదేశించారు. వీధి కుకలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వెటర్నరీ ఏడీకి సూచించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న డబ్బాలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు.
ఉదయ్ నగర్ వ్యాప్తంగా ఎంటమాలజీ ద్వారా దోమలను నియంత్రించేందుకు ఫాగింగ్ చేయాలన్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పూర్తి చేయాలని, ఐదు రోజుల్లో స్వచ్ఛ వార్డుగా మార్చివేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ షాపులను పరిశీలించి నిత్యావసరాల పంపిణీపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, వార్డు నోడల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, డీఈ, వాటర్ వర్స్ డీజీఎం శ్రీనివాస్, శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీఈ శివానంద్, అధికారులు, ఉదయ్ నగర్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.