ఎల్బీనగర్, జూన్ 13: ప్రజల కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా పచ్చదనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొత్తపేట డివిజన్లోని జనప్రియ క్వార్టర్స్, గడ్డిఅన్నారం డివిజన్లోని గౌతంనగర్ కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేసి ప్రజలు వ్యాధులబారిన పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాలాల పూడికతీత, వరదనీటి కాలువల అభివృద్ధి, వర్షం నీరు నిలువకుండా చర్యలు, రోడ్లపై గుంతలను పూడ్చడం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్యశాలల్లో వర్షం నీరు నిలువకుండా చేయడం, దోమల నివారణకు గతు చర్యలు తీసుకోవడం, శ్మశానాలు, పార్కులు శుభ్ర పర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రధానంగా వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించి, శిథిల భవనాలను కూల్చివేయడం ద్వారా ప్రమాదాలకు తావులేకుండా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, కొత్తపేట కార్పొరేటర్ పవన్కుమార్, కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్కుమార్, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ రమణారెడ్డి, గండి సన్నీయాదవ్, సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, సీనియర్ ఎంటమాలజిస్ట్ రజినీ, నాయకులు మల్లికారెడ్డి, శ్వేతారెడ్డి, శైలజ, విజయమ్మ, విజయ, నర్సింహారావు, ఉదయ్, జోగు రాములు, మల్లేపాక యాదగిరి, యాసిన్, రమావత్ దీప్లాల్, బాలసుందరం, కాలనీ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీఎన్ఆర్ కాలనీలో..
వనస్థలిపురం, జూన్ 13: హస్తినాపురం డివిజన్ పిండి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్-1లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి కాలనీలో పర్యటించారు. కాలనీలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. ఇంకా చేయాల్సిన పనులను స్థానికులు వివరించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్త నిర్వహణలో సిబ్బందికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నీల మధు, సంక్షేమ సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.