ఆరో రోజు ఉత్సాహంగా కొనసాగిన కార్యక్రమం
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఆరో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 30 సర్కిళ్లలోని 150 వార్డులు.. 425 కాలనీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పట్టణ ప్రగతిలో నేటికి 2528 కాలనీలు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత మెరుగుపడిందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, మొకలు నాటే స్థలాల గుర్తింపు, పట్టణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు, పూడిక తీత, గుంతలు పూడ్చడం లాంటి పనులు చేపట్టారు.
పట్టణ ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు