అబిడ్స్, జూన్ 6 : సమస్యల పరిష్కారం కోసమే పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. గోషామహల్ నియోజకవర్గం పూల్బాగ్లో సోమవారం మంత్రి పర్యటించి మొక్కలు నాటారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కాలనీలో అధికారులతో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అర్హులను గుర్తించి ఇండ్లను కేటాయిస్తామన్నారు. రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ను నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్సీ రవికిరణ్, డీసీ డి.నాయక్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిశోర్ వ్యాస్, కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాశ్ భీష్వ, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్, బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి పూజావ్యాస్ బిలాల్, ప్రియాగుప్తా, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో అభివృద్ధి
ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ పద్మనాభనగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పద్మనాభనగర్ కాలనీలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్లతో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో జడ్సీ రవికిరణ్, సర్కిల్ -12 డీసీ ఇన్కెషాఫ్ అలీ, ఈఈ లాల్సింగ్, టీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్, నాయకులు కె.శేఖర్రెడ్డి, లక్ష్మీనారాయణ, సంజయ్, మెట్టు నట్రాజ్ పాల్గొన్నారు.
మొక్క నాటుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్
కార్యక్రమంలో పాల్గొన్న కార్వాన్ కార్పొరేటర్ స్వామియాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు
మొక్క నాటుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్
మురాద్నగర్లో ..
మెహిదీపట్నం డివిజన్ మురాద్నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్, నగర మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్ పాల్గొన్నారు. కార్వాన్ నియోజకవర్గం నానల్నగర్ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను చేపట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త ,చెట్ల కొమ్మలను జీహెచ్ఎంసీ అధికారులు తరలించారు. పనులను కార్పొరేటర్ నసీరుద్దీన్ పరిశీలించారు.
చాంద్రాయణగుట్ట, జూన్ 6 : పట్టణ ప్రగతి విజయవంతం చేయడానికి ప్రజలు భాగ్యస్వాములు కావాలని గౌలిపురా కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి అన్నారు. నోడల్, మున్సిపల్ అధికారులతో చర్చించి సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఉప్పుగూడ తొవ్వలబావి, ఛత్రినాక చౌరస్తా, లాల్దర్వాజ, గౌలిపురా మార్కెట్, లలితాబాగ్ ప్రాంతాల్లో రోడ్లుకు ఇరుపైపులా పేరుకుపోయిన మట్టి కుప్పలు, చెత్త,వ్యర్థాలను తొలగింప చేశారు. సీవరేజీ పైపుల పనులు, డ్రైనేజీలు, నాలాల పూడికతీత పనులు చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ సూపర్ వైజర్ మహేందర్, శ్రీధర్, నాయకులు ఈ.సుమన్కుమార్, జి.రఘు, జమాల్పూర్ అశోక్ పాల్గొన్నారు.
కార్వాన్ డివిజన్లో..
పట్టణ ప్రగతి సమస్యల పరిష్కారానికి సులభమైన మార్గమని కార్వాన్ కార్పొరేటర్ ఎం.స్వామియాదవ్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్వాన్ డివిజన్లోని పలు బస్తీల్లో ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలు తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కార్వాన్ కార్పొరేటర్ స్వామియాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు