పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి పిలుపు
బేగంపేట్ ఏప్రిల్ 20: పండుగలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శ్రేణుకుల సూచించారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్లు బస్తీలు, కాలనీల్లో తోరణాలతో సుందరంగ అలంకరించి పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ శ్రేణలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్ లక్ష్మీబాల్రెడ్డి, హేమలతా, మహేశ్వరిశ్రీహరి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి, రూప,తరుణి పద్మారావునగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి పవన్కుమార్గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.