ఖైరతాబాద్, మే 29 : ఇద్దరు గంజాయి విక్రయదారులు పట్టుబడ్డా రు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఇక్బాల్ మంజిల్ హాస్టల్లో ఉండే పిల్లి ఆనంద్ (21), ఖైరతాబాద్ ప్రేమ్నగర్కు చెందిన మద్ది కిశోర్ (24) కిలో గంజాయిని సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు.
పక్కా సమాచారంతో హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్స్ ఇన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ) అధికారులు, పంజాగుట్ట పోలీసులతో కలిసి విరంచీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గమనించిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వెంటాడి పట్టుకున్నారు. కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.