ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 13 : నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ పేరును పార్లమెంట్ భవనానికి పెట్టాలని తీర్మానం చేసిన కేసీఆర్కు దళిత సంఘాలు, విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు, ఆకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుల పట్ల బీజేపీ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కన్న కలలను కేసీఆర్ సాకారం చేస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగం అవినాశ్, కార్యదర్శి దశరథ్, నాయకులు బొల్లు నాగరాజుయాదవ్, జలంధర్, ప్రవీణ్, శేషు, రాజు, రామకృష్ణ, శ్రీను, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.