సికింద్రాబాద్,జూలై 31: తార్నాక డివిజన్ పరిధిలోని ఆర్య నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. అర్యనగర్ స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం సీతాఫల్మండి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ తో సమావేశమై వివిధ సమస్యల పై వినతి పత్రాన్ని సమర్పించారు.
పోలీసు గస్తీ పెంచాలని, సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేయాలని, రోడ్డు పునర్నిర్మాణాన్ని చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంఘం నేతలు కుమార్ షాను, హరి కృష్ణ తదితరులు కోరారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయించాలని కోరారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.