మేడ్చల్, డిసెంబర్25(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిసాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన లక్షా45 వేల క్వింటాళ్ల ధాన్యానికి రూ. 29.50 కోట్లు చెల్లించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రెండు మినహా 10 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు జిల్లా ఫౌరసరఫరాల శాఖ మేనేజర్ రాజేందర్ తెలిపారు. క్వింటాలుకు మొదటి రకానికి ధర రూ. 2060, సాధారణ రకానికి ధర రూ. 2040 రైతులకు చెల్లించారు. వానకాలం జిల్లాలో 18 వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలుతో పాటు మూడు రోజుల్లో నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రబీ పెట్టుబడికి త్వరలోనే రైతుబంధును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్న విషయం విధితమే. రబీలో సాగు చేయాల్సిన పంటలపై రైతులకు వ్యవసాయశాఖ రైతువేదికల ద్వారా అవగాహన కల్పిస్తూ సిద్ధం చేస్తున్నారు.