కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
మేడ్చల్ రూరల్, మే 2 : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదట ధాన్యం కొంటామని, ఆ తర్వాత కొనమని మాటమార్చి మోసం చేసిందన్నారు.
కేంద్రం మొండికేసినా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు.అందులో భాగంగానే మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో పండించిన 16వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రైతులు, ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్లకు రాష్ట్రంలో నూకలు చెల్లినట్టేనని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీలు శైలజావిజయేందర్ రెడ్డి, అనితాలాలయ్య, అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సుధాకర్ రెడ్డి, రణదీప్ రెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, సర్పంచ్ బాబూయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కీసర మండల కేంద్రంలో..
కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఫాంహౌజ్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, సర్పంచ్ మాధురి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, పర్వత్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
శామీర్పేటలో…
శామీర్పేట మండల కేంద్రంలోని సొసైటీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, డీఏవో మేరీరేఖ, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డైరెక్టర్లు , ఏవో రమేశ్, ఏఈవో రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి పాల్గొన్నారు.
ఘట్కేసర్లో…
మండల పరిధిలోని మాదారం, ఎదులాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి ప్రారంభించారు. రైతుబంధు సమితి సభ్యుడు భిక్షపతి గౌడ్, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, కొండల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.