సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్లోని లాలాగూడ సెంట్రల్ రైల్వే దవాఖానలో 500 ఎల్పీఎం (లీటర్ పర్ మినిట్) సామర్థ్యం గల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రారంభించారు. రైల్వే దవాఖానలో చికిత్స పొందేవారికి ఆక్సిజన్ అత్యవసరాలను తీర్చడానికి ప్రస్తుతం ఉన్న 13 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్కు అదనంగా నూతన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఆడిషనల్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ ప్రసన్న కుమార్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రాయన్, లాలాగూడ సెంట్రల్దవాఖాన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.