హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బేగంపేటలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చోటు చేసుకుంది. అల్వాల్కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ ఏవోగా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి అనే ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.
సదరు వ్యక్తికి అనెక్షర్ 1బీ ఫామ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఉద్యోగి రూ.15 వేలు లంచం అడిగాడు. దీంతో అతడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఏసీబీ అధికారులు చెప్పినట్టుగా రూ.15 వేలు ఆ ఉద్యోగికి ఇస్తుండగా.. అధికారులు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని.. కరెన్సీ నోట్ల మీద ఉద్యోగి ఫింగర్ ప్రింట్స్ను టెస్ట్ చేసి అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.