వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 24 నుంచి, ఎమ్మెస్సీ (ఐఎస్) మొదటి సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండో, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలోచూసుకోవచ్చని సూచించారు.
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ల మెయిన్, బ్యాక్లాగ్, ఇతర సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 21వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు చూసుకోవచ్చని సూచించారు.