సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. హిమాయత్సాగర్ 1 గేటును 3 అడుగులు, మరొక గేటును 1 అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఉస్మాన్సాగర్ పూర్తి నీటి మట్టం 1790.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.25 అడుగుల వరకు ఉన్నది. ఎగువ నుంచి ఇన్ఫ్లో 5000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.45 అడుగుల నీటి మట్టం ఉంది.