రవీంద్రభారతి, మార్చి 16 : వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు బుధవారం రవీంద్రభారతిలో పంచగవ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురభి శ్రీనివాస్రావు, డాక్టర్ రంగాచారి, తెలంగాణ నాటక అకాడమి సెక్రటరీ జి.వసుంధర, సైంటిస్ట్ జయతీర్థరావు, ఆయుర్వేద వైద్యులు, రైతులు పాల్గొన్నారు.