కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 11 : కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లిన నిధులే ఎక్కువని, రాష్ర్టానికి వస్తున్న నిధులు మాత్రం తక్కువేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి బాలాజీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దేశానికి మనరాష్ట్రం నుంచే సంపద వెళ్తుందని రాష్ర్టానికి రావాల్సిన నిధులపై కేంద్రం జాప్యం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో తొమ్మిదేండ్ల కాలంలో రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రజలపై ప్రేముంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే కూకట్పల్లిలోని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇంటిని నిర్మించేందుకు తాను బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చారు. కేఅభివృద్ధి పనులు కొనసాగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ బాలాజీనగర్ డివిజన్ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. తొమ్మిదేండ్ల కాలంలో తాగునీటి కష్టాలు, విద్యుత్ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లు తెలిపారు.ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.
ఎమ్మెల్యే మాధవరం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నేత ఆధ్వర్యంలో వివేక్నగర్ డివిజన్కు చెందిన బీజేపీ నేతలు మల్లేశ్, వేణు, సుధాకర్, సురేశ్ పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రవణ్కుమార్, ముత్యపాగ శ్రీనివాస్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, ప్రభాకర్ గౌడ్, కర్క పెంటయ్య, సాయిబాబా చౌదరి, వెంకటేశ్ చౌదరి, పవన్కుమార్, అనితాశ్రీపాల్, హరినాథ్, బండి సుధ, అరుణాశెట్టి, లక్ష్మీనారాయణ, లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు.