Cyber Security | కాచిగూడ : కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు.
మంగళవారం కాచిగూడలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఐటీ రంగం, ఇన్మఫర్మేషన్ రంగం, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీర్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివిన అర్హత గల గల యువతీ,యువకులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. వివరాలకు 7893141797, ఆన్లైన్లో www.nacsindia.org అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు. ఆమె కోరారు.