సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. సైబర్ నేరస్తుల మాటల మాయలో పడి మంచి హోదాలో ఉన్న విద్యావంతులు కూడా లక్షల్లో డబ్బులు చేజార్చుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వేర్వేరు కేసుల వివరాలను మీడియాకు వెల్లడించారు.
దుబాయ్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న బెర్లిన్ ఆరితేరిన సైబర్ నేరగాడు. అక్కడి నుంచే ట్రేడింగ్ పేరుతో ఆన్లైన్ మోసాలు చేస్తుంటాడు. రాజస్థాన్లోని జోథ్పూర్కు చెందిన రాంచంద్ర నకిలీ కేవైసీలు, నకిలీ సంస్థల పేర్లను సృష్టించి దొంగ బ్యాంకు ఖాతాలు సృష్టించి ఆ వివరాలన్నింటినీ బూర రామ్ అనే వ్యక్తి ద్వారా దుబాయ్లోని బెర్లిన్కు చేరవేస్తుంటాడు. ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలొస్తాయని నమ్మించి పలువురిని టెలిగ్రామ్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టిస్తారు. ఇదంతా నిజమేనని నమ్మిన నగరవాసి ఒకరు దఫదఫాలుగా కోటి రూపాయలకు పైగా ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడి ఫిర్యాదుతో ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్ నరేశ్ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితులను పట్టుకునేందకు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నేపాల్ నుంచి బూరరామ్ వస్తుండగా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు దేశ వ్యాప్తంగా 507 కేసులతో సంబంధం ఉండగా.. తెలంగాణకు సంబంధించినవి 67 కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి రూ. 1.44 కోట్లు ఫ్రీజ్ చేశారు. అందులో రూ. 55 లక్షలు బాధితుడికి కోర్టు ద్వారా రిఫండ్ చేశారు. కాగా విదేశాల్లో ఉన్న బెర్లిన్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మరో సైబర్ముఠా తాము పాంథియెన్ వెంచర్ కంపెనీకి సంబంధించిన వాళ్లమని చెప్పి ఓ ట్రేడింగ్ యాప్ తయారు చేశారు. ప్రారంభంలో స్వల్ప లాభాలు చూపించి ఆకర్షించి ఆ తర్వాత దఫదఫాలుగా పెట్టుబడి పెట్టించారు.
సైబర్నేరస్తుల వలలో చిక్కుకొని నగరానికి చెందిన ఓ విద్యావంతుడు కోటికి పైగా సమర్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీసీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్రావు బృందం దర్యాప్తు చేపట్టింది. అయితే సైబర్నేరస్తుల ట్రేడింగ్ లావాదేవీలకు అనుగుణంగా ఇండియా నుంచే కొంతమంది నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలు సృష్టిస్తున్నారు. రాజస్థాన్కు చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మాజీ ఉద్యోగి అశితోస్ రాజ్ తన పాత పరిచయాలతో పలువురి సహకారంతో నకిలీ కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి ఇతర దేశాల్లో ఉన్న సైబర్నేరగాళ్లకు చేరవేస్తున్నారు. ఈ ముఠాలో పలువురిని అరెస్టు చేశారు. 170కి పైగా కేసులతో వీరికి సంబంధం ఉందని తేల్చారు. ఇలాగే… యుకైన్8. టాప్ పేరుతో వెబ్సైట్ తెరిచి ట్రేడింగ్ పేరుతో వందలాది మందిని మోసం చేసిన మరో ముఠాను కూడా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 92 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. దాదాపు 16 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఈ ముఠా నుంచి 1.68 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు శ్వేత, కవిత, రష్మిపెరుమాళ్, ఏసీపీ శివమారుతీ, సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.’