హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటలో (Nizampet) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.63 లక్షలు, ల్యాప్టాప్, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ సూత్రదారులైన రామకృష్ణ, మనోహార్లు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.