సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కల్తీ కారం పొడిని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన రూపారం ఖాత్రీ అలియాస్ రూపేశ్ కొన్ని సంవత్సరాల కిందట హైదరాబాద్కు వలస వచ్చాడు. అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఉంటూ గార్మెంట్స్ వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో మానేశాడు.
ఆ తర్వాత కారం పొడి తయారు చేసేందుకు ఫ్లోర్ మిల్ను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన మిషనరిని ఉస్మాన్గంజ్లో ఏర్పాటు చేశాడు. స్వస్తిక్ బ్రాండ్ పేరుతో సాచెట్స్ తయారు చేయించి రెడ్ కలర్, ఆయిల్, ఇతర రసాయనాలతో ఎర్ర కారం పొడిని తయారు చేస్తున్నాడు.
ఈ కారం పొడిని స్వస్తిక్ బ్రాండ్తో మార్కెట్లో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి.. రూ.4 లక్షల విలువైన కల్తీ కరం పౌడర్, ముడి పదార్థాలు, ఫ్లోర్ మిల్ సామగ్రి, తదితర వస్తువులను సీజ్ చేశారు.