హైదరాబాద్ : జగదిరిగుట్ట(Jagadirigutta)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభాన్ని(Power pole) కారు(Car) ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా(One person died) మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాకదర సంఘటన జగదిరిగుట్టలోని ఉషా ముళ్లపూడి వద్ద సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి గాజుల రామారం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ యాదగిరి(55) అనే ప్రయాణికుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్టు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.