హైదరాబాద్: మేడ్చల్ (Medchal) జిల్లాలోని సుతారిగూడ సమీపంలో ప్రమాదం జరిగింది. సుతారిగూడ వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రేష్మాబేగం, ఉమర్ భార్యాభర్తలు. ఇద్దరు మోటారుసైకిల్పై గండిమైసమ్మ నుంచి మేడ్చల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో సుతారిగూడ వద్ద వారి బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో రేష్మా అక్కడికక్కడే మృతిచెందింది. ఉమర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.