హైదరాబాద్: నగర శివార్లలోని దుండిగల్లో (Dundigal) రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్పల్లిలో రోడ్డుపై బ్రేక్డౌన్ అయిన డీసీఎంను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతుడిని సంతోష్గా గుర్తించారు. సూరారం నుంచి గండిమైసమ్మ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.