సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : జలగం వెంగళరావు పార్కులో ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ను ఈ నెల 27న ఉదయం 6.30 గంటలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేయర్ అధికారులకు సూచించారు. ఆదివారం జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి మేయర్ జేవీఆర్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పండుగను ప్రజలు భక్తిశద్ధ్రలతో జరుపుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.