సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న ఉదయం 10 .30 గంటలకు జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం జనరల్ బాడీ సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రజావాణి, కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉండవన్నారు. అయితే సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో ప్రజావాణి యధావిధిగా ఉంటుందన్నారు.