వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 1: దేశవ్యాప్తంగా నూనెగింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని ఐసీఏఆర్ భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐకార్ – ఐఐవోఆర్) డైరెక్టర్ డాక్టర్ ఎం సుజాత అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆ సంస్థ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్తోపాటు తెలుగు రాష్ర్టాల్లో నూనెగింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ప్రధానంగా తెలంగాణలో నూనెగింజల సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సదస్సులో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ప్రొ. సైన్సెస్) ఆర్ శర్మ, సంజీవ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఐసీఎంఆర్- ఎన్ఐఎన్) డైరెక్టర్ డాక్టర్ హేమలత, వివిధ ఐకార్ సంస్థల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.