సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లడంతో ఆయా కాలనీలు సగం ఖాళీ అయ్యాయి. అయితే ఇదే అదనుగా తీసుకుని దోపిడీ దొంగలు విరుచుపడకుండా ట్రై కమిషనరేట్లకు చెందిన పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రధానంగా రాత్రి సమయాల్లో పోలీసు గస్తీ పెంచినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా జనసంచారం తక్కువగా ఉన్న కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక నిఘా పెట్టామని, సీసీకెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.