పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, ఇంకుడుగుంతల పరిశీలన
విద్యుత్ సమస్యలు పరిష్కారం
మేడ్చల్ జోన్ బృందం, జూన్ 8 : పట్టణ ప్రగతి కార్యక్రమం నియోజకవర్గంలోని మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో జోరుగా కొనసాగుతున్నది. మేయర్లు, చైర్పర్సన్లు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకొని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. వచ్చే వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. మేడ్చల్ మున్సిపాలి పరిధిలోని 2, 4వ వార్డుల్లో చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి, కమిషనర్ అహ్మద్ షఫీయుల్లాతో కలిసి పర్యటించారు. వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు సరితామల్లేశ్ గౌడ్, డీఈ విజయలక్ష్మి, ఏఈ సాయిరాం రెడ్డి, మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి పరిధిలోని 4, 11, 14, 15 వార్డుల్లో చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ రాములు, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు బాలరాజ్, హేమంత్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తూంకుంట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో చైర్మన్ రాజేశ్వర్రావు పర్యటించి పచ్చదనం, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్ జేతూరామ్, కౌన్సిలర్లు ఉమాశ్రీనివాస్, వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
పీర్జాదిగూడ పరిధిలోని 2, 26వ డివిజన్లో పలు పారిశుధ్య పనులు నిర్వహించారు. కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్ సుభాష్నాయక్, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. జవహర్నగర్ పరిధిలోని 7, 8, 15, తదితర డివిజన్లలో మేయర్ మేకల కావ్య పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. 7వ డివిజన్లో నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ముంపునకు గురయ్యే పలు డివిజన్లలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోచారం చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో ఒకటో వార్డులోని శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లను కూల్చివేశారు. ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఒకటో వార్డు ఎన్ఎఫ్సీ నగర్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. కమిషనర్లు సురేశ్, వసంతలు, మేనేజర్లు నర్సింహులు, అంజిరెడ్డి పాల్గొన్నారు. నాగారం మున్సిపాలిటీ 14వ వార్డులో, దమ్మాయిగూడ 8వ వార్డులో పట్టణ ప్రగతి నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు పనులను చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీతాశ్రీకాంత్ గౌడ్ ప్రారంభించారు. వైస్ చైర్మన్లు మల్లేశ్, నరేందర్ రెడ్డి, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీ పట్టణ ప్రగతిలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యాంసన్, చైర్మన్ బి.కొండల్రెడ్డి
4వ వార్డులో పర్యటిస్తున్న మేడ్చల్ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, అధికారులు, నాయకులు తదితరులు