Numaish | అబిడ్స్, ఫిబ్రవరి 18 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్సింగ్, కోశాధికారి ఏనుగుల రాజేందర్కుమార్ నేతృత్వంలో ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు.
ఎగ్జిబిషన్ సాఫీగా సాగేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 1938లో మొదట పబ్లిక్ గార్డెన్స్లో వంద స్టాళ్లతో ప్రారంభించిన నుమాయిష్.. క్రమ, క్రమంగా ప్రజాదరణ పొందింది. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ వర్గాలు తెలంగాణ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో కళాశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతున్నాయి.