సుల్తాన్బజార్, జనవరి 8: కళలకు కాదేది అనర్హమని, చిత్రకారుని కుంచె నుండి జాలువారిన పెయింటింగ్లు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)లోని ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చందర్జీత్ సింగ్, కోశాధికారి ఈ రాజేందర్కుమార్, అశ్విన్ మార్గం, ఆర్ట్ ఎగ్జిబిషన్ కన్వీనర్ డి హనుమంతరావు, ఆర్ట్ సొసైటీ సభ్యులు జే వెంకటేశ్, కాం తారెడ్డి, జి మల్లేశ్, రాజేందర్నాగు లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు అనంతయ్య, కప్పారి కిషన్, సురభి అజిత, సత్య గన్నోజు, విట్టల్, జి. రమేశ్, ఎ. బాలరాజ్, పి. మహేశ్, పి. రాజేందర్కుమా ర్, అన్నారపు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.