అబిడ్స్, ఏప్రిల్ 3: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 8వ తేదీ ఆఖరని ప్రకటించారు. స్టాళ్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు మరో ఆరురోజులు పొడిగించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 9,10 తేదీల్లో ఎగ్జిబిషన్ను మూసివేస్తామని చెప్పారు.