కందుకూరు/మహేశ్వరం, జనవరి 10 : కరువుతీరా నీళ్లిచ్చి, ఉచిత కరంటిచ్చి, పెట్టుబడికి పైకమిస్తూ, బీమాతో ధీమానిస్తూ అన్నితీర్లా ఆసరా అవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రైతన్నల అభిమానం ఆకాశాన్నంటుతున్నది. దేశంలో ఎక్కడాలేని పథకాలు తమ కోసం పెట్టి ఎవుసాన్ని పండుగ చేశాడంటూ నిండుమనస్సుతో కృతజ్ఞతను చాటుతున్నారు. బండెనక బండి కట్టి.. తీరొక్క పూలు, పంట ఉత్పత్తులతో ముగ్గులేసి.. నారుతో పేర్లు రాసి.. క్షీరాభిషేకాలు చేసి రైతుబాంధవుడు కేసీఆర్కు జైకొడుతున్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సోమవారం రైతన్నల సంబురాలు హోరెత్తాయి.
రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఏ ఒక్కరికీ లేదని సవాల్ విసిరారు. ముందెన్నడూ లేని విధంగా రైతుల ఖాతాల్లో పంట సాయం పెట్టుబడి జమ అవుతుండటంతో రైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. సోమవారం మహేశ్వరం మండలం పరిధిలోని మన్సాన్పల్లి చౌరస్తా నుంచి మహేశ్వరం రైతు వేదిక వరకు రైతులు గిరిజనులతో కలిసి ఎండ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా కందుకూరు హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై నిర్వహించిన రైతుబంధు సంబురాలు ఆకట్టుకున్నాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై కిసాన్, జై కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కందుకూరు సభలో మంత్రి సబితా ఇందారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
రైతులను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్రలు
63లక్షల మంది రైతుల ఖాతాల్లో యాసంగికి రూ.7.500కోట్ల పంట సాయం అందించామని తెలిపారు. వడ్ల కొనుగోలుపై బీజేపీ వ్యవహారం బయటపడటంతో రైతులను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ టీఆర్ఎస్పై కుట్రలు పన్నుతున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు రైతుబంధు పథకాన్ని విమర్శిండం సిగ్గుచేటని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీజీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ , మేఘనాథ్రెడ్డి, ఉపాధ్యక్షులు సామ మహేందర్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సోలిపేట అమరేందర్రెడ్డి, సామయ్య, పాండుగౌడ్, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, విజ్ఞేశ్వర్రెడ్డి, తాళ్ల కార్తిక్, ఎంపీసీటీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కృష్ణ రాంభూపాల్రెడ్డి, నియోజకవర్గం నాయకులు సాయిలు, ఎంపీటీసీ రాములు, లలిత, దశరథ ముదిరాజ్, గంగాపురం అక్ష్మీనర్సింహారెడ్డి, సురేందర్రెడ్డి, డైరెక్టర్లు సామ ప్రకాశ్రెడ్డి, శేఖర్రెడ్డి, పాండురంగారెడ్డి, పారిజాతం, సర్పంచ్లు భూపాల్రెడ్డి, రామకృష్ణారెడ్డి, కళమ్మ రాజు, సాయిలు. శ్రీదేవి శేఖర్రెడ్డి, బాలమణి అశోక్ ముదిరాజ్, సదాలక్ష్మీ పుల్లారెడ్డి, జ్యోతి శేఖర్, శ్రీనివాస్, శమంతకమణి, శ్రీలత శ్రీహరి, కొండల్రెడ్డి, మూల హన్మంత్రెడ్డి. సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, ప్రశాంత్చారి, బాల మల్లేశ్, ఉమాకాంత్రెడ్డి, మోహన్రెడ్డి, మస్కు బాబు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్న ఘనత ఒక తెలంగాణ సర్కారుకే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాలలో మంత్రి మాట్లాడారు. వరి పంటలో పంజాబ్ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అందించిన ప్రోత్సాహకమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సురసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, రైతుబంధు మండల చైర్మన్ రాఘవేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, మాజీ అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, సర్పంచ్లు మెగావత్ రాజునాయక్, కరోళ్లప్రియాంక రాజేశ్, మోతీలాల్నాయక్, చంద్రశేఖర్రెడ్డి, సాలీవీరా నాయక్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, మాజీ సర్పంచ్ ఆనందం, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆథిల్ అలీ, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మద్ది కరుణాకర్రెడ్డి, బండారి లావణ్యలింగం, మంత్రి రాజేశ్, ఎంఏ సమీర్, మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్రెడ్డి డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య, అశోక్కుమార్, అంబయ్య యాదవ్, మునగపాటి నవీన్, పరిగి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.