బీజేఎంసీ పరిధిలో రూ.50 కోట్లతో ట్యాంకుల నిర్మాణం
వంద కిలోమీటర్ల మేర పైపులైన్లు
మరో రెండు నెలల్లో పనులు పూర్తి
బండ్లగూడ,ఏప్రిల్ 12: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చిందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అధికారులు తాగునీటి పైపులైన్ల నిర్మాణంతో పాటు వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను చేపడుతున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జలమండలి అధికారులు రూ. 50 కోట్లతో ఐదు తాగునీటి ట్యాంకుల నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పటికే గంధంగూడ, బైరాగిగూడ, కిస్మత్పూర్, పద్మశ్రీహిల్స్, రాక్చర్చి వద్ద పైపులైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ట్యాంకుల నిర్మాణం పూర్త యితే భవిష్యత్తులో నీటి ఎద్దడిని పూర్తి స్థాయిలో నివారించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జూన్, జూలై నెల వరకు పనులను పూర్తి చేసి రోజు విడిచి రోజు తాగునీటిని వదులుతామని అధికారులు తెలిపారు,
ఐదు వాటర్ ట్యాంకుల నిర్మాణం
ప్రభుత్వ ఆదేశాలతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. బీజేఎంసీ పరిధిలో మొత్తం ఐదు తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు వంద కిలో మీటర్ల మేర పైపులైన్ల నిర్మిస్తున్నాం. త్వరలో పనులు పూర్తి చేస్తాం.
– నరేందర్,బీజేఎంసీ జలమండలి మేనేజర్