శేరిలింగంపల్లి : డ్రగ్స్ కేసులో నిందితుడు నిమ్మగడ్డ సాయివిగ్నేష్ ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి కాదని పూర్వ విద్యార్ధని యూనివర్సిటీ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీడియాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని నిమ్మగడ్డ సాయి విగ్నేష్ 2021 సంవత్సరంలోనే మానేశాడని అన్నారు.
హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ పొగ్రామ్ ఇన్ సోషియాలజీలో 2018 సంవత్సరంలో అఢ్మిషన్ పొంది మూడు సంవత్సరాల అనంతరం 2021లో మద్యాంతరంగా యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీలో తాజాగా సాయి విగ్నేష్ విద్యనభ్యసించడం లేదని, క్యాంపస్తో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు.
కానీ కొన్ని మీడియా చానెళ్లలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఫలితంగా ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం వాటిళ్లుతుందని తెలిపారు.