సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీని ప్రభావంతో నగరంపై చలి పంజా విసురుతోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.6 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.